Rachakonda News : ఈ రోజు రాచకొండ పోలీస్ కమిషనర్ శ్రీ సుధీర్ బాబు ఐపీఎస్ గారు మహిళా రక్షణ కొరకు షీ టీమ్స్ నూతన సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో మరింత వేగవంతంగా పనిచేయడానికి ఉపయోగపడేలా మరియు ఆకతాయిల వేధింపులను నియంత్రించడం కోసం ప్రజల్లో అవగహన కల్పించడానికి ఈ రోజు రాచకొండ కమిషనరేట్ నేరేడ్మెట్ నందు షీ టీమ్స్ సిబ్బందికి లాప్టాప్స్, పెన్ కెమెరాలు, ప్రొజెక్టర్స్, ప్రింటర్స్, సెల్ ఫోన్స్ వంటి సాంకేతిక పరికరాలు పంపిణీ చేయడం జరిగింది.
మహిళా భధ్రత కోసం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఈ నూతన సాంకేతిక పరికరాలతో మరింత సమర్థవంతంగా పని చేయాలని ఈ సందర్భంగా కమిషనర్ గారు సూచించారు. ఈ కార్యక్రమంలో డిసిపి ఉమెన్స్ సేఫ్టీవింగ్ ఉషా విశ్వనాథ్ గారు, ఇన్స్పెక్టర్ ముని గారు, ఇన్స్పెక్టర్ అంజయ్య గారు, అడ్మిన్ ఎస్ ఐ రాజు గారు మరియు షీ టీమ్స్ సిబ్బంది పాల్గొన్నారు.