MS Dhoni : టీమిండియా మాజీ కెప్టెన్, ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ నిర్మాతగా మారబోతున్నాడు. గత ఏడాది దీపావళి నాడు ధోని తన సినిమా ప్రొడక్షన్ ఆఫీస్ ఓపెన్ చేసి సినీ కెరీర్ ని స్టార్ట్ చేశాడు. ధోని ఎంటర్టైన్మెంట్స్ పతాకం పై సౌత్ లో ఉన్న పలు భాషల్లో తాను సినిమాలు నిర్మించబోతున్నట్లు తెలియజేశాడు. దీంతో ధోని నిర్మాణంలో పలానా హీరో నటించబోతున్నాడు అంటూ గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వాస్తు ఉన్నాయి. తాజాగా ధోని తన మొదటి ప్రాజెక్ట్ ని అధికారికంగా ప్రకటించాడు.
ఈ సినిమాకి ‘లెట్స్ గెట్ మ్యారీడ్’ (ఎల్ జీఎం) పేరును ఖరారు చేశారు. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ కింద తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను తీయనున్నారు. ఈ మూవీకి నిర్మాతగా ధోనీ భార్య సాక్షికి, దర్శకుడిగా రమేష్ తమిళమణికి ఈ సినిమా మొదటిది కావడం గమనార్హం. ధోనీ ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ పేరుతో ఉన్న ట్విట్టర్ పేజీలో ఈ సినిమాకు సంబంధించి పోస్ట్ ను గమనించొచ్చు. ధోని ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తుండగా… ఇప్పుడు నిర్మాతగా మరి తమిళ సినిమా తీయనుండడం ఆసక్తికరం.
We're super excited to share, Dhoni Entertainment's first production titled #LGM – #LetsGetMarried!
Title look motion poster out now! @msdhoni @SaakshiSRawat @iamharishkalyan @i__ivana_ @HasijaVikas @Ramesharchi @o_viswajith @PradeepERagav pic.twitter.com/uG43T0dIfl
— Dhoni Entertainment Pvt Ltd (@DhoniLtd) January 27, 2023
తమిళంలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో ‘హరీష్ కళ్యాణ్’ సినిమాలో హీరోగా చేస్తున్నారు. ఇక లవ్ టుడే సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి ‘ఇవనా’.. ఈ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. అలానే ఒకప్పటి హీరోయిన్ నదియా, తమిళ స్టార్ కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించబోతున్నారు. మూవీ టైటిల్ తో పాటు చిత్ర యూనిట్ ని ప్రకటిస్తూ ధోని ఒక వీడియో రిలీజ్ చేశాడు. గతంలో ధోనీని హీరోగా పెట్టి ‘అథర్వ ది ఆరిజిన్’ అనే గ్రాఫిక్ నవలని రూపొందించినది కూడా ‘రమేష్ తమిళమణి’ కావడం గమనార్హం. ఇక మూవీ టైటిల్ చూస్తుంటే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్లా అనిపిస్తుంది. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.