యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో శర్వానంద్ నటిస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ `ఆడవాళ్లు మీకు జోహార్లు`. రష్మిక మందన్న హీరోయిన్. రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా సినిమా బజ్ను మరింత పెంచడానికి సహాయపడుతోంది. ఇప్పటికే విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన నాల్గవ పాట మాంగళ్యం తంతునానేనా విడుదలైంది. ఏస్ కంపోజర్ ఈ చిత్రానికి భిన్నమైన మరియు అద్భుతమైన ట్రాక్లను ట్యూన్ చేశారు. ఈ పాట థీమ్, కంపోజ్ చేసిన విధానం, విశేషమైన గానం, ఫన్నీ లిరిక్స్ అన్నికలిపి ఈ పాటను మ్యూజిక్ చార్ట్లలో అగ్రస్థానంలో నిలబెట్టాయి.
‘మాంగళ్యం తంతునానేనా’ అనే శ్లోకాన్ని ఆధునీకరించిన ఈ పాటలో శర్వానంద్ తన చిరాకు చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన ఈ పాటకు జస్ప్రీత్ జాస్ గాత్రం అందించారు. శర్వా డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి.నటీనటులు : శర్వానంద్, రష్మిక మందన్నా, వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కృష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు
సాంకేతిక బృందం: దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి, బ్యానర్ : శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్, సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, సంగీతం, దేవీ శ్రీ ప్రసాద్,ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఏఎస్ ప్రకాష్
కొరియోగ్రఫర్: దినేష్, పీఆర్వో: వంశీ-శేఖర్.