Politics కరోనా మళ్ళీ మొదటికి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది గత కొన్ని నెలలగా కరోనా తో ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ఎందరో చనిపోయారు కరోనా మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు అయితే ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు నిత్యం కనిపిస్తుండగా భారత్ కూడా ఎక్కువ అవుతున్నాయి ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించారు ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దీనిపై కఠిన ఆంక్షలు విధించారు..
న్యూ ఇయర్ వేడుకలపై తెలంగాణ ప్రభుత్వ ఆంక్షలు విధించింది.. ముఖ్యంగా హైదరాబాదులో ఘనంగా జరిగే ఈ న్యూ ఇయర్ వేడుకలు కరోనా కు కారణమని భావించిన తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు జారీ చేసింది ఈ సందర్భంగా డిసెంబర్ 31న ఖచ్చితంగా కొన్ని అంశాలు పాటించాలని తెలిపింది అలాగే ఈ సందర్భంగా పలు రోడ్లు హైవేలు ఆపేస్తున్నట్టు కూడా తెలిపింది..
డిసెంబర్ 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు నగరంలో పలు రూల్స్ అమలులో ఉంటాయని.. వాటికి అనుగుణంగా అందరూ నడుచుకోవాలని తెలిపారు అలాగే ఆ సమయంలో ప్రయాణించాలి అనుకునే వారు సైతం సరైన ఆధారాలు పట్టుకుని ఉండాలని తెలిపారు అంతేకాకుండా.. నగరంలోని శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, బయోడైవర్సిటీ, షైక్పేట్, మైండ్స్పేస్, రోడ్ నెం.45, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, సైబర్ టవర్స్, ఫోరమ్ మాల్- జేఎన్టీయూ, ఖైత్లాపూర్, బాలానగర్ ఫ్లైఓవర్లలన్నీ కూడా ఆ రోజు రాత్రి 11 గంటల నుంచి జనవరి 1న ఉదయం 5 గంటల వరకు బంద్ అవుతాయి. అలాగే హైదరాబాద్ లో పంతాలలో రోడ్లు ఫ్లైఓవర్లు మూసి ఉంటాయని చెప్పారు.. ఇందులో ఔటర్ రింగ్ రోడ్డు, పీవీఆర్ ఎక్స్ప్రెస్వే మూసి వేయబడతాయి. అయితే ఎయిర్పోర్ట్కి వెళ్లే ప్రయాణీకులు మాత్రం టికెట్లు చూపి వెళ్లొచ్చునని పోలీసులు తెలిపారు.