Tollywood News : నందమూరి కళ్యాణ్ రామ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. ఈ యాక్షన్-ప్యాక్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో ఈ రెండు పాత్రలు మధ్య డైనమిక్స్ కీలకంగా వుండబోతున్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ‘అర్జున్ S/O వైజయంతి’ టీజర్, సాంగ్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ & ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. మ్యాన్ అఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీరిలీజ్ ఈవెంట్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన అభిమాన సోదరులందరికీ నా నమస్కారాలు. ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయ మిత్రులకు, మీడియా మిత్రులకు, అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమా బృందానికి అందరికీ కూడా నా నమస్కారాలు. ఈ వేదిక పైన నేను అన్న నిలుచున్నప్పుడు నాన్నగారు చాలా సార్లు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈరోజు నాన్నగారు లేని లోటు తీరినట్లు అయింది విజయశాంతి గారు మాట్లాడుతుంటే. ఈవెంట్ లో నాన్నగారు ఉంటే ఎలా ఉండేదో విజయశాంతి గారు మాట్లాడుతూ ఉంటే ఆ లోటు నాకు భర్తీ అయిపోయింది.
చాలామంది గొప్ప సినిమాలు చేసి అద్భుతంగా అలరించారు. కానీ విజయశాంతి గారు సాధించినటువంటి గొప్పతనం ఏ మహిళ సాధించలేదు, కర్తవ్యం, ప్రతిఘటన, మగరాయుడు ఇలా ఎన్నో వైవిధ్యమైనటువంటి పాత్రలు చేశారు. నాకు తెలిసి భారత దేశంలో ఏ నటి విజయశాంతి గారి లాంటి వైవిధ్యమైనటువంటి పాత్రలు చేయలేదు. ఆ ఘనత ఆవిడ ఒక్కరికే దక్కింది. భారతదేశ చలనచిత్ర పటంలో హీరోలకి సమానంగా నిలుచున్న ఏకైక మహిళ విజయశాంతి గారే. ఈ చిత్రం ఆలోచన కూడా కర్తవ్యంలో ఉన్న పాత్రకు ఒక కొడుకు పుడితే ఎలా ఉంటుందో అనే ఆలోచన నుంచే మొదలయింటుందని భావిస్తున్నాను. ఈ వేడుకకు రావడం అభిమానులందరినీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ఈ సినిమా నేను చూశాను. విజయశాంతి గారు లేకపోతే ఈ సినిమా లేదు. పృథ్వి గారు లేకపోతే, సోహెల్ లేకపోతే ఈ సినిమా లేదు. ప్రదీప్ చిలుకూరి డైరెక్టర్ కాకపోతే ఈ సినిమా లేదు. సునీల్ గారు అశోక్ గారు ప్రొడ్యూసర్స్ లేకపోతే ఈ సినిమా లేదు. ఒక్కొక్కళ్ళు ప్రాణం పెట్టి ఈ సినిమాకు పని చేశారు. సినిమా చుసిన నాకు తెలుసు ఈ సినిమాని వాళ్ళు ఎంత నమ్మారో. 18 తారీఖున మీ అందరి ముందుకు రాబోతుంది ఈ సినిమా. రాసి పెట్టుకోండి. ఆఖరి 20 నిమిషాలు థియేటర్స్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అంత అద్భుతంగా మలిచారు. ప్రతిసారి కాలర్ ఎగరేయమని నేను చెప్తుంటాను. ఈసారి కళ్యాణ్ అన్న కాలర్ని నేను ఎగరేస్తున్నాను. కళ్ళ నుంచి నీళ్లు ఆపుకోవడం నావల్ల కాలేదు. రేపొద్దున్న మీ అందరికీ అర్థమవుతుంది. ఆ ఆఖరి 20 నిమిషాలు అలా రావడానికి కారణం కళ్యాణ్ అన్న మాత్రమే. ఆయన ఆ ఆలోచనని నమ్మక పోయి ఉంటే. ఒక ప్రేక్షకుడిగా నేను ఎంజాయ్ చేసే వాడిని కాదు. ఆయన నమ్మి డెడికేటెడ్ గా వర్క్ చేశారు.
అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి కళ్యాణ్ అన్న కెరీర్ లో ఒక స్పెషల్ మూవీగా నిలిచిపోతుంది. విజయశాంతి గారిని అమ్మ అని నమ్మేసి చేశారు. తల్లిగా నమ్మేశారు కాబట్టే అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడం జరిగింది. ఈ సినిమాలో సాంకేతిక నిపుణులకు నటీనటులందరికీ నా అభినందనలు. 18 తారీఖున అందరికీ బ్రహ్మాండమైన సినిమా రాబోతుంది .అభిమానులు మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఏప్రిల్ 18న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా రిలీజ్ కాబోతుంది. ఆగస్టు 14న వార్ 2 సినిమా రిలీజ్ కాబోతుంది. ఆ సినిమా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది.
ఇక్కడికి వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు. ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తుంటారు. ప్రతి అభిమాని నాకు చాలా ముఖ్యం. నాన్నగారు ఈ వేదిక మీద ఉన్నప్పుడు ఈ జన్మ అభిమానులకి అంకితం అని చెప్పాను. ఈ జన్మ ఈ జీవితం మీకే అంకితం. త్వరలోనే మళ్లీ మీ అందరినీ కలుసుకుంటాను. కొంచెం ఓర్పు సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు సహనానికి మారుపేరు. త్వరలోనే కలుసుకుందాం. సరదాగా మాట్లాడుకుందాం. అందరూ ఏప్రిల్ 18 వ తారీఖున థియేటర్స్ లో కలుసుకుందాం. అర్జున్ సన్ అఫ్ వైజయంతి చిత్రాన్ని భారీ విజయం దిశగా తీసుకెళ్లాలని మిమ్మల్ని అందరిని కోరుకుంటున్నాను. జై ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ. అందరికీ ధన్యవాదాలు’అన్నారు.