Anchor Rashmi : ప్రస్తుతం బుల్లితెరపై రాణిస్తున్న స్టార్ యాంకర్స్ లో రష్మీ గౌతమ్ ఒకరు. బుల్లి తెర యాంకర్గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది రష్మి గౌతమ్. ఓ వైపు బుల్లి తెరపై కనిపిస్తూనే మరోవైపు సిల్వర్ స్క్రీన్పై అడపాదడపా తళుక్కుమంటోందీ చిన్నది. ఇక కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది రష్మి. ఈ క్రమంలోనే తన కెరీర్ విశేషాలతో పాటు వ్యక్తిగత వివరాలను కూడా ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది. పలు టీవీషోలతో చాలా ఫెమస్ అయ్యింది రష్మీ. ఇక టీవీ షోలతోనే కాదు సినిమాల్లోనూ నటించింది రష్మీ.
ఈ అమ్మడు అందంతో అభినయం తో బుల్లితెర పైనే కాదు వెండితెర మీద కూడా అవకాశాలు అందుకుంటుంది. ఇక తనదైన మాటలతో యాంకరింగ్ తో కట్టిపడేసే రష్మీ .. కాంట్రవర్సీ కి ఈ ముద్దుగుమ్మ దూరంగా ఉంటూ వస్తుంది. తన పై వచ్చే ట్రోల్స్ గురించి కూడా రష్మీ పట్టించుకున్న సందర్భాలు కూడా తక్కువే.. తాజాగా రష్మీ ఇంట విషాదం చోటు చేసుకుంది.
తాజాగా రష్మీ గ్రాండ్ మదర్ ప్రమీల మిశ్రా కన్నుమూశారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతా ద్వారా రష్మి వెల్లడించింది. ప్రమీల మిశ్రా స్ట్రాంగ్ మహిళ అని, మాపై ఆమె ప్రభావం ఎంతో ఉండేదని, మాకు భౌతికంగా దూరమైన ఆమె జ్ఞాపకాలు మాతో ఎప్పుడూ ఉంటాయని ఓం శాంతి అంటూ రష్మి గౌతమ్ పోస్ట్ పెట్టింది. దీంతో రష్మీ ఫ్యాన్స్ కూడా ఆమెకు దైర్యం చెప్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.