కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ నుంచి శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కిన అర్జున ఫల్గుణ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది.
మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ల కాంబినేషన్లో ఆచార్యను తెరకెక్కించిన కొరటాల శివ అర్జున ఫుల్గుణ ట్రైలర్ను విడుదల చేశారు.
డిగ్రీ అయిపోయి తన ఫ్రెండ్స్తో కలిసి జాలీగా తిరిగే పాత్రలో శ్రీ విష్ణు కనిపిస్తున్నారు. ఇక ఆ ఊర్లోని అమ్మాయిగా అమృతా అయ్యర్ ఆ గ్యాంగ్లో చేరుతారు. ఆ గ్యాంగ్ అంతా కూడా సినీ అభిమానులుగా కనిపిస్తారు. స్టార్ హీరోల పేర్లతో వారిని వారు పరిచయం చేసుకుంటారు. ఇలా జాలీగా ఉన్న వారి జీవితాల్లోకి అనుకోని ప్రమాదాలు వస్తాయి. అవి ఏంటి? వారిని ఎవరు వెంటాడుతున్నారు? అనే ప్రశ్నలకు సమాధానమే అర్జున ఫల్గుణ.ఈ చిత్రంలో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్, నరేష్, శివాజీ రాజా, సుబ్బ రాజు, దేవీ ప్రసాద్, రంగస్థలం మహేష్, రాజ్ కుమార్ చౌదరి (రాజా వారు రాణి గారు ఫేమ్), చైతన్య (మిడిల్ క్లాస్ మెలోడీస్ ఫేమ్) తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సాంకేతిక బృందం :
నిర్మాతలు : నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి
సహ నిర్మాత : ఎన్ ఎమ్ పాషా
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : తేజ మర్ని
డైలాగ్స్ : సుధీర్ వర్మ. పి
సినిమాటోగ్రపీ : జగదీష్ చీకటి
ఆర్ట్ డైరెక్టర్ : గంధి నడికుడికర్
యాక్షన్ : రామ్ సుంకర
మ్యూజిక్ డైరెక్టర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యన్
లిరిక్స్ : చైతన్య ప్రసాద్
పబ్లిసిటీ డిజైన్ : అనిల్&భాను
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్ : ప్రసన్న వర్మ దంతులూరి