Ayushman Bharat Yojana, PM Modi, Ayushman Bharat Telangana, National Health Authority, Covid News, Telangana News, Health News, PMJAY,
HEALTH NEWS: తెలంగాణలోనూ ఆయుష్మాన్ భారత్ అమలు: సీఏం కేసీఆర్
కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్ పథకం.. ఇకపై తెలంగాణలోనూ అమలు కానుంది.
ఈ మేరకు నేషనల్ హెల్త్ అథారిటీతో రాష్ట్రప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పథకం అమలుకు సంబంధించిన విధివిధానాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఖరారు చేసింది.
నిబంధనల మేరకు వైద్య సేవలు అందించాలని సీఏం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆయుష్మాన్ భారత్ దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య బీమా పథకమని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో రాంచీలో లాంఛనంగా ప్రారంభించారు.
అయితే, అంతకు ముందు ఆగస్టులోనే హరియాణాలోని కర్నాల్లో జన్మించిన కరిష్మా అనే బాలికనుఈ పథకం మొదటి లబ్ధిదారుగా చెబుతారు. ఈ పథకం కింద పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు.
ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు చికిత్స ఉచితం. దీని కింద దేశవ్యాప్తంగా 20 వేలకు పైగా ఆసుపత్రులలో 1000 కి పైగా వ్యాధులకు ఉచితంగా చికిత్స చేయించుకోవచ్చు.