Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రాల్లో `ఉస్తాద్ భగత్ సింగ్` ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం గ్రాండ్గా ప్రారంభోత్సవం జరుపుకుంది. రెగ్యూలర్ షూటింగ్కి కొంత సమయం పడుతుందని సమాచారం. ఇదిలా ఉంటే ఈ చిత్రం విజయ్ నటించిన `తెరి` లోని మెయిన్ పాయింట్స్.. అలాగే హరీష్ శంకర్ రాసుకున్న `భవదీయుడు భగత్ సింగ్` కథ మేళవింపుగా రూపొందబోతుందని సమాచారం.
`తేరి`లోని పాప, మహిళలకు సంబంధించిన సెంటిమెంట్ అంశాలను, భవదీయుడులోని పవర్ ఫుల్ క్యారెక్టరైజేషన్ని మిక్స్ చేసి `ఉస్తాద్ భగత్ సింగ్`గా తెరకెక్కించబోతున్నారని తెలుస్తుంది. అయితే `తేరి`లో విజయ్, సమంత ఓ పాప ఉంటుంది. అందులో నటి మీనా కూతురు నటించింది. ఇప్పుడు తాజాగా పవన్కి కూతురిగా అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హని తీసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు జరిగాయని, బన్నీ వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ లభించిందని సమాచారం.
అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ ఇప్పటికే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె సమంత మెయిన్ రోల్లో నటించిన `శాకుంతలం` చిత్రంలో బాల నటిగా నటిస్తుంది. ఇందులో బాల భరతుడి పాత్రలో అల్లు అర్హ నటిస్తుండటం విశేషం. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ లవ్ స్టోరీ ఫిబ్రవరి 17న విడుదల కాబోతుంది. పవన్ సినిమాలు బాలనటిగా, పైగా ఆయన కూతురిగా అంటే ఎంతటి పేరొస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఈ వార్త హాట్ టాపిక్ అవుతుంది. మరోవైపు ఈరోజే పవన్ – సుజిత్ కాంబోలో రాబోతున్న OG సినిమాకి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం ఆ ఫోట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.