Crime News : పశ్చిమ బెంగాల్ లోని అలీపుర్దూర్ జిల్లాలో ఓ కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న నింపింది. విద్యార్దిని ఓ షాపింగ్ మాల్లో చాక్లెట్లు దొంగిలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో… మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు. ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా… వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కాగా పోలీసుల కథనం ప్రకారం… జైగావ్ పోలీస్ స్టేషన్ పరిధి లోని సుభాష్ పల్లిలో డిగ్రీ మూడో సంవత్సరం చదువుతోంది.
సెప్టెంబరు 29న తన సోదరితో కలిసి ఆ ప్రాంతం లోని ఓ షాపింగ్ మాల్కు వెళ్లింది. అక్కడి నుంచి వెళ్లిపోతుండగా చాక్లెట్లు దొంగిలిస్తూ పట్టుబడింది. దీంతో షాప్ యాజమానికి క్షమాపణలు చెప్పి… చాక్లెట్ కు తిరిగి డబ్బులు చెల్లించింది. అయితే ఈ ఘటనను షాపులో ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్గా మారింది. దీంతో అవమానానికి గురై ఇంట్లో ఉరివేసుకుని ఆత్యహత్య చేసుకుంది.
దీంతో స్థానికులు షాపింగ్ మాల్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వీడియో తీసి ఆన్లైన్లో పోస్ట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు జైగావ్ ఇన్ఛార్జ్ అధికారి ప్రబీర్ దత్తా పేర్కొన్నారు. ఈ విషయంలో తదుపరి చర్యలు తీసుకుంటున్నామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఘటనను పలువురు ఖండిస్తుండగా అన్నింటిని ఇలా సోషల్ మీడియాలో పెట్టడం సబబు కాదంటూ వాపోతున్నారు.