Movie ప్రముఖ సీనియర్ నటుడు రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి చెంది సినీ ఇండస్ట్రీకి తీవ్ర విషాదాన్ని మిగిల్చారు. ఇకపోతే ఈయనతో పాటు 2022లో పలువురు సినీ ప్రముఖులు కూడా కన్నుమూశారు. వారెవరో ఇప్పుడు తెలుసుకుందాం..
తాతినేని రామారావు.. తెలుగుతోపాటు హిందీలో కూడా పలు సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు తాతినేని రామారావు ఏప్రిల్ 20వ తేదీన తుది శ్వాస విడిచారు. బాలయ్య.. టాలీవుడ్ సీనియర్ నటుడు బాలయ్య ఏప్రిల్ 9న కన్నుమూశారు . ఇక ఈయన నటుడిగా 300 కు పైగా చిత్రాలలో నటించి మెప్పించారు. దర్శకుడు శరత్ .. ఏప్రిల్ ఒకటిన సీనియర్ దర్శకుడు శరత్ కన్ను మూయడం జరిగింది. కృష్ణ హీరోగా వచ్చిన అల్లూరి సీతారామరాజు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన ఆ తర్వాత ఏ కోదండరామిరెడ్డి దర్శకత్వ శాఖలో అసోసియేట్ గా పనిచేశారు. సుమన్ హీరోగా వచ్చిన చాదస్తపు మొగుడు సినిమాతో దర్శకుడిగా మారారు. కందికొండ యాదగిరి.. తెలంగాణ యాస, భాష, సంస్కృతిని ప్రజలకు చేరువచేసిన కందికొండ యాదగిరి మార్చి 12వ తేదీన కన్ను మోసారు. మ్యూజిక్ డైరెక్టర్ ఈశ్వరరావు.. మార్చి 12న అనారోగ్యంతో కన్నుమూశారు. ప్రదీప్ కొట్టాయం.. మలయాళీ నటుడు కొట్టాయం గుండెపోటుతో ఫిబ్రవరి 17వ తేదీన కన్నుమూశారు . ఏ మాయ చేసావే , రాజా రాణి వంటి సినిమాలలో కూడా నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులుగా మారారు.
వీరితోపాటు ప్రముఖ సీనియర్ నటి కెపిఏసి లలిత, బప్పి లహరి, సంధ్య ముఖర్జీ, దీప్ సిద్దు , ప్రవీణ్ కుమార్ సోబ్తీ, రవీనా టాండన్, లతా మంగేష్కర్ , కొంచాడ శ్రీనివాస్, పండిట్ బ్రిడ్జి మహారాజ్, రమేష్ బాబు, పి చంద్రశేఖర్ రెడ్డి తదితర ప్రముఖులు ఇదే ఏడాది కన్నుమూశారు.